నూతన సంవత్సరం వేళ ప్రపంచం అంతా సంబరాల్లో మునిగి పోయింది. అదే సమయంలో జపాన్ ను భారీ భూ కంపం కుదిపపేసింది. జాపాన్ పశ్చిమ తీర రాష్ట్రాలు వణికిపోయాయి. రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రతతో సంభవించింది. గడిచిన నలబై ఎనిమిది గంటల్లో 48 మంది మృతి చెందినట్టు పమాచారం.
ఈ భూకంపం పెద్ద ఎత్తున ఆస్తి నష్టం వాటిల్లింది. జపాన్ భూ కంపంపై దర్శకుడు రాజమౌళి స్సందించారు. భూ కంపం జపాన్ను తీవ్రంగా అతలాకుతలం చేసిందని, అది తనను కలిచి వేసిందని తెలిపారు. తన హృదయంలో జపాన్ దేశానికి ఎంతో ప్రత్యేకత ఉందన్నారు. భూ కంపం బారిన పడిన ప్రతి జపనీయుడికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారు సాధ్యమైనంత త్వరలో ఈ పరిస్థితి నుండి బయటపడాలని భావిస్తున్నట్టు ట్విట్టర్ వేదికగా రాజమౌళి ట్వీట్ చేశారు.
జక్కన్న దర్శకత్వంలో విడుదలై సత్తా చాటిన బాహుబలి-1, బాహుబలి-2, ఆర్ఆర్ఆర్ చిత్రాలకు జపాన్ లో ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. జపాన్ లో ఈ చిత్రాలను వీక్షించడానికి థియేటర్లకు జనాలు పోటెత్తారు. ఆ సినిమాల ప్రమోషన్స్ కోసం జపాన్ వెళ్లిన సందర్భంలో రాజమౌళి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లపై జపాన్ ప్రజలు ప్రత్యేక అభిమానం చూపారు. జపాన్ లో రాజమౌళి, నటులను
విశేషంగా ఆదరించారు.