వైసీపీ ఐదో జాబితాపై సీఎం జగన్ కసరత్తు కసరత్తు కొనసాగుతోంది. ఇప్పటి వరకు నాలుగు విడతల్లో పలు పార్ల మెంట్, అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ..ఇవాళ సాయంత్రం ఐదో జాబితా ప్రకటించేందకు రంగం సిద్ధం చేస్తోంది. ఐదో విడత అభ్యర్థులు ప్రకటన కోసం అటు ఆశావహులు, ఇటు పార్టీ కేడర్కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, నరసరావు పేట పార్లమెంట్ఇ న్చార్జ్ల ను ఐదో జాబితాలో ప్రకటించే అవకాశం ఉంది.మరోవైపు 15 ఎంపీ, 117 అసెంబ్లీ సెగ్మెంట్లలో వైసీపీ అభ్యర్థులను ప్రక టించాల్సి ఉంది. అయితే సుమారు 100 స్థానాల్లో ప్రకటించాల్సిన అభ్యర్థులపై స్పష్టతకు వచ్చిన అధిష్టానం.. మిగిలిన స్థానాలపై తీవ్రంగా కసరత్తు చేస్తోంది. పాత వారికి ఇస్తే విజయావకాశాలు తక్కువగా ఉండడం, కొత్త వారికి ఇస్తే సీనియ ర్లు కలిసి వచ్చే అవకాశాలు లేకపోవడం వంటి అంశాలతో ఏం చేయాలన్న దానిపై హైకమాండ్ ఆలోచన చేస్తోంది.