Free Porn
xbporn
24.7 C
Hyderabad
Saturday, July 27, 2024
spot_img

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ లో కొత్త చైతన్యం

         ఉమ్మడి అనంతపురం జిల్లా….ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. కాకలు తీరిన రాజకీయ నాయకులు రాష్ట్ర రాజకీయాలపై బలమైన ప్రభావం చూపేవారు. బలమైన నాయకుల ప్రభావం వల్ల వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయంలో జిల్లాలో పార్టీ ఓ వెలుగు వెలిగింది. రాష్ట్ర విభజన తర్వాత దాదాపు ఓ దశాబ్దంపాటు స్థబ్దత నెలకొంది. ఆంధ్ర ప్రదేశ్ లో అడ్రస్ లేకుండా పోయింది. అలాంటి నేపథ్యంలో మళ్లీ కాంగ్రెస్ పునరుజ్జీవనం మొదలైంది. కాంగ్రెస్ స్పీడ్ అందుకుం ది.

         ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ లో కొత్త చైతన్యం వచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత నామమాత్రపు పార్టీగా మిగిలిన కాంగ్రెస్ కు మళ్లీ మంచిరోజులు వచ్చాయి. ఒకప్పుడు ఏపీలో కాంగ్రెస్ ఇక బతకడం కష్టమేనన్నారు. దశాబ్దాలపాటు తిరుగులేని రాజకీయం చేసిన కాంగ్రెస్ కు గ్రామస్థాయి నుంచి బలమైన కేడర్ ఉంది. కానీ వారికి మార్గనిర్దేశం చేసే బలమైన నాయ కుడు లేకపోవడంతో నిస్తేజంగా ఉన్న వారందరికీ షర్మిల రాక తో నూతనోత్సాహం వచ్చింది. చురుగ్గా యువనాయకు రాలు షర్మిల సీనియర్లను కలుపుకుని పోతూ చక్రం తిప్పుతున్నారు.దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి బిడ్డగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన షర్మిల…పీసీసీ బాధ్యతలు తీసుకున్న వెంటనే రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల పర్యటన కు శ్రీకారం చుట్టారు. పాతతరం నాయకులను కలుస్తూ కాంగ్రెస్ కు పూర్వ వైభవం తీసుకురావడానికి…పార్టీలోకి ఆహ్వా నిస్తోంది. తన తండ్రితో సన్నిహితంగా మెలిగిన వాళ్లను కలిసి తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతోంది షర్మిల. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించిన షర్మిల అనంతపురం జిల్లాలోనూ అడుగుపెట్టింది. రాజన్న బిడ్డ రాకతో కాంగ్రెస్ నాయకుల్లో ఎక్కడ లేని ఉత్సాహం వచ్చింది. పెద్దఎత్తున గ్రామ స్థాయి నుంచి కాంగ్రెస్ నాయకులు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా సంవత్సరాల తర్వాత జిల్లాలో ఆ ఊపు కొనసాగుతున్నట్లు కనిపిస్తోంది. కీలకమైన నేతలు తిరిగి రెగ్యూలర్ రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనడంతో పాటు గా కొత్తగా పార్టీలో చేరే వారితో కాంగ్రెస్ ఫుల్ జోష్ మీద ఉంది.

        కాంగ్రెస్ కు పునర్ వైభవం తేవాలంటే.. ఎన్నికల రాజకీయాల్లో పోటీ పడాల్సిందే. అప్పుడే కేడర్ నిలబడుతుం దన్న వాస్తవం గుర్తించిన కాంగ్రెస్ ..ఆ అంశంపై దృష్టి పెట్టింది. అందుకే ఏపీసీసీ పగ్గాలు చేపట్టిన షర్మిల రానున్న ఎన్నికల్లో తప్పకుండా ప్రధాన పార్టీలకు దీటుగా సమాధానం ఇస్తామని ప్రకటించారు. అందుకు అనుగు ణంగా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈనెల 11న సత్యసాయి జిల్లా మడకశి నియోజకవర్గం లో వైఎస్ షర్మిల పర్యటించాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల పర్యటన రద్దయింది. ఒక వేళ షర్మిల పర్యటన చేసి ఉంటే ఆ కార్యక్రమాన్ని విజయ వంతం చేసి…మళ్లీ పార్టీకి జవసత్వాలు అందించాలని సీనియర్లు భావించారు. సీనియర్ నేతలు మాజీమంత్రులు రఘువీరారెడ్డి, శైలజానాథ్ ఎలాగైనా జిల్లాలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం తీసుకురావాలనే దృఢ సంకల్పం తో ఉన్నారు.

       పదేళ్లపాటు పిలచి టిక్కెట్ ఇస్తామని బ్రతిమాలినా ముందుకు రాని నేతలు షర్మిల రాకతో పార్టీ టిక్కెట్ల కోసం ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. వైసీపీలో టిక్కెట్లు రాని వారు…సీఎం జగన్ పై గుర్రుగా ఉన్నా టీడీపీ లోకి వెళ్లలేని వారికి కాంగ్రెస్ మంచి ప్రత్యామ్నాయ వేదిక అవుతోంది. అలాంటి అసంతృప్తి నేతలంతా ఇప్పుడు కాంగ్రెస్ నేతలతో టచ్ లోకి వచ్చారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా వైసిపి అధిష్టానం నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు లేవని ఇప్పటికే స్పష్టంచేసింది. వారి స్థానంలో వేరే వాళ్లకు టికెట్ ఇచ్చింది. వీరిలో సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి, మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి ఉన్నారు. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి వైసీపీలో టికెట్ రాకపోవడంతో మనస్థాపా నికి గురై వైసీపీకి రాజీనామా చేశారు. ప్రస్తుతం కాపు రామచంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో నిలుస్తున్నట్లు స్పష్టమైన సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి.

        కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి సైతం హస్తం గూటికి చేరనున్నట్లు తెలుస్తోంది. అదే బాటలో సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి సాగుతున్నారు. పార్టీ పునరుజ్జీవనంలో షర్మిలకు మద్దతు అందించేందుకు సిద్ధంగా ఉన్నారాన్న వార్తలు వినిపిస్తున్నా యి. మారిన రాజకీయ పరిణామాలు కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా షర్మిలకు కలిసొచ్చేలా ఉన్నాయి. వైసీపీ, టీడీపీ నుంచి టిక్కెట్లు రాని నేతలంతా కాంగ్రెస్ కు క్యూ కట్టే అవకాశం ఉంది. టీడీపీ లో ఇప్పటికీ అభ్యర్థులను ప్రకటించక పోవడం, కేవలం పార్లమెంట్ స్థానాలను మాత్రమే ప్రకటించడంతో ఎంపీగా పోటీ చేసేందుకు చాలామంది నాయకులు సుముఖంగా లేరు. తమకు అసెంబ్లీ స్థానాలు కేటాయించాలని అధిష్టానం దగ్గర పడి గాపులు పడుతున్నారు. అధిష్టా నం నిర్ణయం తెలిస్తే.. వారి కార్యాచరణ మొదలవుతుంది. టిడిపి , జనసేన పొత్తుల వల్ల టికెట్టు కోల్పోయే నాయకుల కు కాంగ్రెస్ ఓ ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది.

Latest Articles

యూఎస్ఏలో నేడు ‘పేక మేడలు’ రిలీజ్

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్