మత సామరస్యానికి ప్రతీక అయిన మచిలీపట్నంలో హిందూ, ముస్లింలను విడదీసే ప్రయత్నం చేస్తున్నారని జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి విమర్శించారు. రంజాన్ పర్వదినాలను పురస్కరించుకుని ముస్లింలకు మచిలీపట్నం ఎమ్మెల్యే అభ్యర్థి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వల్లభనేని బాలశౌరి, కొల్లు రవీంద్రతోపాటు మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు, నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ బండి రామకృష్ణ పాల్గొని ముస్లిం లతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందూ ముస్లిం భాయి భాయి అనే నినాదంతోనే ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లాలన్నారు. రాజకీయాలలో కోసం వైసీపీ ప్రభుత్వం ముస్లిం హిందువులను విడదీసే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.
వైసీపీ హిందూ ముస్లీంలను విడదీస్తుంది – బాలశౌరి
0
185
Latest Articles
బండి భగీరథ్కు మూడు రోజుల పోలీస్ కస్టడీ
పోక్సో కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్ను పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించింది. 3 రోజుల కస్టడీకి అనుమతి ఇస్తూ మేడ్చల్ కోర్టు ఉత్తర్వులు జారీ...
- Advertisement -
- Advertisement -


