వైఎస్సార్సీపీ నేత వై.ఎస్. అభిషేక్ రెడ్డి కన్నుమూశారు. అనారోగ్యంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పటల్ లో చికిత్స్ పొందుతూ తుది శ్వాస విడిచారు. కాసేపటి క్రితం కన్నుమూశారని వైద్యులు ధృవీకరించారు. అభిషేక్ రెడ్డి పార్థివదేహాన్ని హైదరాబాద్ నుంచి పులివెందులకు తరలిస్తున్నారు. శనివారం ఉదయం అభిషేక్ రెడ్డికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అంత్యక్రియల్లో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వై.ఎస్ జగన్ పాల్గొననున్నారు.