టీమిండియా క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే ఇద్దరు దిగ్గజాల మధ్య విభేదాలు తారాస్థాయికి వచ్చాయి. షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోవడానికి కూడా ఇష్టపడని వారు తాజాగా సోషల్ మీడియాలోనూ అన్ ఫాలో చేసుకున్నారు. భారత క్రికెటర్ కింగ్ విరాట్ కోహ్లీ, బీసీసీఐ మాజీ చీఫ్ సౌరవ్ గంగూలీ మధ్య వివాదానికి ఫుల్ స్టాప్ పడేలా లేదు. మొన్న ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచులో గంగూలీకి షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు కోహ్లీ నిరాకరించాడు. ఈ ఫోటోలు, వీడియో వైరల్ కావడంతో వీరి మధ్య విభేదాలు ఉన్నట్లు ప్రపంచానికి తెలిసింది.
దీనిపై చర్చ జరుగుతుండగానే గంగూలీని ఇన్ స్టాగ్రాంలో కోహ్లీ అన్ ఫాలో అయ్యాడు. వెంటనే గంగూలీ కూడా తన ఇన్ స్టాలో కోహ్లీని అన్ ఫాలో చేశాడు. దీంతో వీరి మధ్య విభేదాలు ఎక్కువైనట్లు స్పష్టంగా అర్థమవుతోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే కోహ్లీ తన కెప్టెన్సీ కోల్పోయిన సంగతి తెలిసిందే.