25.3 C
Hyderabad
Tuesday, July 1, 2025
spot_img

కార్పొరేట్ స్కూళ్ల నిలువు దోపిడి

  సిద్ధిపేట తెలంగాణ రాష్ట్రంలోనే అన్ని జిల్లాలకు ఆదర్శంగా నిలిచిన జిల్లా. ప్రతి యేటా అభివృద్ధి పథంలో ముందు కు దూసుకుపోతుంది. దీంతో ప్రైవేట్ సంస్థలు సైతం ఇక్కడ భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ముఖ్యంగా ప్రైవేట్ విద్యా సంస్థలు పెద్ద సంఖ్యలో తమ బ్రాంచులను ఏర్పాటు చేస్తున్నాయి. కార్పొరేట్ కాలేజీలు, పాఠశాలల సంఖ్య విపరీ తంగా పెరిగిపోయాయి. ఇంకేముంది చదువు పేరుతో ప్రైవేట్ విద్యా సంస్థలు అందినకాడికి దండుకుం టు న్నాయి. ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను నిలువు దోపిడీ చేస్తున్నాయి. కానీ విద్యాశాఖ అధికా రులు మాత్రం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రైవేట్ విద్యా సంస్థల్లో విద్యార్థు లకు కనీస మౌలిక సదుపాయాలు ఉన్నాయా లేవా అన్నది కూడా పట్టించుకోకుండా అనుమతులు ఇవ్వడంతో.. విద్యాశాఖ అధికారులపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. సిద్ధిపేట జిల్లాలోని ప్రైవేట్ విద్యా సంస్థలపై ఓ లుక్కేద్దాం.

తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు వేసవి సెలవులు ముగియడంతో ఈనెల 12 నుంచి స్కూళ్లు పునః ప్రారంభమయ్యాయి. బడి గంటలు మోగ నుండటంతో విద్యార్థుల తల్లిదండ్రుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. జిల్లాలో ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు ఏటా ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచుతూ నిలువు దోపిడీ చేస్తున్నాయి. అడ్మిషన్లు, యూనిఫామ్స్, పుస్తకాల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల జేబుకు చిల్లు పెడుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యా పూర్తిగా వ్యాపారంగా మారిపో యింది. ఇంత జరుగుతున్నా విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలనే ఆశ ఒక వైపు.. అధిక ఫీజులతో మోయలేని భారం మరోవైపు దీంతో విద్యార్థుల తల్లి దండ్రులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.ప్రైవేట్ పాఠశాలలకు టెక్నో, ఒలంపియాడ్ వంటి ఆకర్షణీయ మైన పేర్లు పెడుతూ యాజమాన్యాలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. అంగన్ వాడీ కేంద్రాల్లో ఆడుకుంటూ చదువుకోవాల్సిన పిల్లలు ప్రైవేట్ పాఠశాలల్లో నర్సరీ, ఎల్ కేజీ క్లాసుల్లో చేరడమేంటంటు న్నారు విద్యార్థి సంఘాల నాయకులు. ఫిట్ నెస్ లేని స్కూలు బస్సులతో విద్యార్థులకు ప్రమాదాలు జరిగితే ఎవరు బాధ్యత తీసుకుంటారన్నారు. ఫిట్ నెస్ లేని ప్రైవేట్ బస్సులపై అనుమతులు లేని ప్రైవేట్ పాఠశాలలపై జిల్లా కలెక్టర్ వెంటనే చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నా రు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ అనుమతులు లేని, కనీస మౌలిక సదుపాయాలు లేని ప్రైవేట్ పాఠశాలలపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలంటూ పలు విద్యార్థి సంఘాల నాయకులు కోరారు. కానీ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలతో జిల్లా విద్యాశాఖ అధికారులు కుమ్మక్కయ్యారని, అందుకే నిబంధనలు పాటించని ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవడం లేదంటున్నారు విద్యార్థి సంఘాల నాయకులు. ఇలాంటి పరిస్థితుల్లో జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

సిద్ధిపేట జిల్లాలో ప్రైవేట పాఠశాలల యాజమాన్యాలు అధిక ఫీజులు వసూలు చేయడమే కాకుండా పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్ లను మరికొన్ని పాఠశాలలకు అనుబంధంగా బుక్ స్టాల్స్ ఏర్పాటు చేసి విక్రయిస్తున్నారు. యూనిఫామ్ లు, షూస్ తాము చెప్పిన చోటే కొనుగోలు చేయాలంటూ నిబంధనలు పెడుతున్నాయి. స్కూలు యాజమాన్యం పుస్తకాలు విక్రయిస్తే ఎలాంటి లాభాలు ఆశించకుండా విక్రయించుకోవచ్చని ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడంతో ప్రైవేట్ పాఠశాలలు యథేచ్ఛగా పుస్తకాలు విక్రయిస్తున్నాయి. దీంతో పాటు స్కూలు బస్సు రవాణాకు చెల్లించాల్సిన సొమ్మును సైతం అదనంగా వసూలు చేస్తున్నాయి. జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ కొరవడింది. ప్రభుత్వం ఎన్ని జీవోలు, నిబంధనలు తీసుకొచ్చినా ప్రయోజనం లేకుండా పోతుంది. అప్పులు చేసైనా సరే తమ పిల్లలకు నాణ్యమైన విద్యా అందించాలనే తపనను ఆసరాగా చేసుకున్న ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు భారీగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలతో పాటు ఉచితంగా పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్ లు, మధ్యాహ్న భోజనం అందిస్తున్నాయి. పదో తరగతి పరీక్షల్లో సైతం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారు. కొన్ని చోట్ల ప్రభుత్వ పాఠశాలల్లో నో అడ్మిషన్ల బోర్డు పెట్టే పరిస్థితి వచ్చింది. అయినా కూడా కొందరు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాల మోసపూరిత ప్రకటనలకు ఆకర్షితులవుతున్నారు.

విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి డబ్బులు లాగడానికి ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఎన్నో సాకులు వెతుకుతు న్నారు. డీజిల్ ధరలు పెరిగాయంటూ రవాణా ఫీజులను పెంచుతున్నాయి. గతంలో 5 కి.మీ. పరిధిలో 15వేల రూపా యలు తీసుకుంటే 5 నుంచి 10 కి.మీ. వరకు 17 వేల రూపాయలు తీసుకునే వారు. 10 కి.మీ. కంటే ఎక్కువ దూరం ఉంటే 20వేల రూపాయలు వసూలు చేసేవారు. డీజిల్ ధరలు పెరిగాయంటూ ఈసారి రవాణా ఫీజులను మరింతగా పెంచి వసూలు చేస్తున్నాయి. ఫీజులకు తోడు రవాణా ఫీజులు కూడా భారం కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా అధికారులు స్పందించి ప్రైవేట్ పాఠశాలల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు. సిద్ధిపేట జిల్లాలో కార్పొరేట్ స్కూళ్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ప్రకటనలతో విద్యార్థుల తల్లి దండ్రులను ఆకర్షించి ప్రలోభాలకు గురి చేస్తున్నాయి. నాణ్యమైన విద్య అందిస్తామంటూ విద్యార్థులకు బంగారు భవిష్యత్ ఉంటుందంటూ నమ్మబలికి విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద భారీగా ఫీజులు వసూలు చేస్తు న్నారు. విద్యా హక్కు చట్టం అమలు చేయని కార్పొరేట్ పాఠశాలలపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని, అవసరమైతే అలాంటి ప్రైవేట్ స్కూళ్లను సీజ్ చేయాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

నిబంధనలు పాటించని ప్రైవేట్ పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు డీఈవో శ్రీనివాస్ రెడ్డి. ప్రైవేట్ స్కూళ్లలో ఒకే విధమైన ఫీజు ఉండేలా నిర్ణయం తీసుకునే అవకాశముందన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో పుస్తకాలు MRP కంటే అధిక ధరకు విక్రయించకూడదంటూ ప్రభుత్వం ఇటీవలె ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ట్రెస్మా రాష్ట్ర అధ్యక్షు లు జగ్గు మల్లారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ అనుమ తులు లేని ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించిన వారి భవిష్యత్తును నాశనం చేయొద్దన్నారు . పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పించే ముందు ప్రభుత్వ అనుమతులు ఉన్నాయా లేదా అనే విష యాన్ని తల్లిదండ్రులు తెలుసుకోవాలన్నారు. కార్పొరేట్ పాఠశాలలన్నీ ప్రభుత్వ నిబంధనలు పాటిం చేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్