అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్ని లక్కిరెడ్డి రాకేష్ రెడ్డి , రోహిత్ మణికంఠ రేపాల గా గుర్తించారు. అమెరికా అరిజోనాలోని ఫాజిల్ క్రీక్ ఫాల్స్ వద్ద ఈ ఘటన జరిగింది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న 16 మంది స్నేహితుల బృందం ఈనెల 8న జలపాతం సందర్శనకై వెళ్లింది. జలపాతం వద్ద ఈత కొడుతున్న క్రమంలో రాకేష్, రోహిత్ గల్లంతయ్యారు. సమా చారం అందు కున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికితీసారు.మృతుల్లో ఒకరైన రాకేష్ ఖమ్మంకు చెందిన లక్కిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఏకైక కుమారుడు. కంప్యూటర్ సైన్స్ ఎంఎస్ పూర్తి చేశాడు. ఇటీవలే రాకేష్ తల్లిదండ్రులు అమెరికాకు వెళ్లారు. ఇంతలోనే ఈ ఘటన జరగడం వారి ఇంట తీవ్ర విషాదాన్ని నింపింది.