25.3 C
Hyderabad
Tuesday, July 1, 2025
spot_img

దళారులతో టీఎస్పీఎస్సీని నింపేశారు- టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

స్వతంత్ర వెబ్ డెస్క్: రాజ్యాంగబద్ధమైన సంస్థ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ను రాజకీయ పునరావాసంగా మార్చేశారంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. పదో తరగతి పరీక్షలు నిర్వహించలేరు.. పన్నెండో తరగతి పేపర్లు దిద్దలేరు.. ఎంసెట్ పరీక్షా పత్రాలు అమ్ముకునేవారు.. సింగరేణి ఉద్యోగాలను అమ్ముకునే వారు చివరకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను కూడా కలుషితం చేశారని ఆరోపించారు. దళారులుగా వ్యవహరించిన వారిని, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన వారిని తీసుకొచ్చి టీఎస్పీఎస్సీలో నియమించారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఉన్నత విద్యావంతులు ఉండాల్సిన స్థానంలో గుమస్తాలుగా కూడా పనికిరాని వారిని కూర్చోబెట్టారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఎస్పీఎస్సీలో అనర్హులను నియమిస్తే ఉద్యోగ నియామకాలను సరిగ్గా నిర్వహించలేరంటూ గతంలోనే ఆందోళనలు జరిగాయని, కోర్టులో పిటిషన్లు కూడా దాఖలయ్యాయని గుర్తుచేశారు.

నిరుద్యోగులు, మేధావులు ఆందోళనలు వ్యక్తం చేసినా సరే ప్రభుత్వం పట్టించుకోలేదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రాజకీయ అవసరాల కోసం గుమస్తా హోదా కూడా లేనివారిని ఉన్నత పదవుల్లో కూర్చోబెట్టిందని విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం ఫలితంగా గ్రూప్ 1 రాసిన నిరుద్యోగులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారని చెప్పారు. గ్రూప్ 1 పరీక్ష రెండుసార్లు రద్దయిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. బోర్డులో అనర్హులు ఉండడం వల్ల టీఎస్పీఎస్సీ ఒక్క పరీక్షనూ సక్రమంగా నిర్వహించలేకపోతోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్