Site icon Swatantra Tv

హస్తం గూటికి తీన్మార్ మల్లన్న.. సీఎం అభ్యర్థిత్వాన్ని వదులుకొని మరీ..

స్వతంత్ర వెబ్ డెస్క్: కాంగ్రెస్ పార్టీలో తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ చేరారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కేవలం మూడు వారాల సమయం ఉన్న నేపథ్యంలో… తీన్మార్ మల్లన్న కీలక నిర్ణయం తీసుకున్నారు. తన గొంతు కాంగ్రెస్ పార్టీ ద్వారా వినిపించాలనే ఉద్దేశంతో… ఇన్ని రోజులు బిజెపిలో ఉన్న తీన్మార్ మల్లన్న తాజాగా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ మేరకు ఎఐసిసి తెలంగాణ ఇన్చార్జ్ మాణిక్ రావ్ తక్రే, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ తీన్మార్ మల్లన్నకు కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ విషయాన్ని స్వయంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తన సోషల్ మీడియాలో ప్రకటన చేసింది. కాగా గత కొన్ని రోజుల నుంచి తెలంగాణ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి పై తీవ్రస్థాయిలో తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డి టికెట్లు అమ్ముకున్నాడని… బీసీలకు రేవంత్ రెడ్డి అవమానం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు తీన్మార్ మల్లన్న. కానీ అనుహంగా ఇవ్వాళ మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరారు. దీంతో తీన్మార్ మల్లన్న పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇంకా ఎన్ని పార్టీలు మారతావు తీన్మార్ మల్లన్న అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version