తనకు ఓటు వేసిన వాళ్లు తలదించుకునే పని ఎప్పడూ చేయలేదని అన్నారు సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డి. నైతిక విలువలకు కట్టుబడి ప్రజాప్రతినిధిగా కొనసాగుతూ వస్తున్నానని చెప్పారు. తాను ఎటువంటి అక్రమాలు, దౌర్జన్యాలు, బెదిరింపులకు పాల్పడలేదని అన్నారు. హామీలు అమలు చేయని కాంగ్రెస్కు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని ఆరోపించారు. కాంగ్రెస్తోనే తమకు పోటీ అని, బీఆర్ఎస్కు డిపాజిట్లు కూడా రావని చెప్పారు. బీఆర్ఎస్ శకం ముగిసిందన్న కిషన్ రెడ్డి.. సికింద్రాబాద్లో కాషాయ జెండా ఎగరేయబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు.