హైదరాబాద్ లో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా మరోసారి పోస్టర్ల కలకలం

Poster War |దేశంలో ప్రస్తుతం రాజకీయ నాయకులకు సంబంధించిన పోస్టర్ల ట్రెండ్ నడుస్తోంది. ప్రత్యర్థి పార్టీల నాయకులను టార్గెట్ చేస్తూ ఇతర పార్టీల నేతలు పోస్టర్లు అంటిస్తున్నారు. తెలంగాణలో కూడా కొంతకాలంగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య పోస్టర్ల వార్(Poster War) జరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్ లోని ఉప్ప‌ల్ – నార‌ప‌ల్లి ఫ్లై ఓవ‌ర్ నిర్మాణం విష‌యంలో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. ‘మోదీ గారు ఈ ఫ్లైఓవర్ ఎన్ని సంవత్సరాలు కడతారు..? 2018, మే 5న ఉప్పల్-నారపల్లి ఫ్లైఓవర్ పనులు ప్రారంభమై.. ఇప్పటికీ ఐదేళ్లు పూర్తయినా 40 శాతం పనులు కూడా పూర్తి కాలేదంటూ’ అంటూ మెట్రో పిల్లర్లపై పోస్టర్లు ఏర్పాటుచేశారు. ఈ పోస్టర్లపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. బీఆర్ఎస్ నేతలే కావాలనే మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు అంటిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. పోస్టర్లను ఏర్పాటు చేసినవారిని వెతికే పనిలో పడ్డారు.

Read Also: అది నా బాధ్యత.. బంగ్లా ఖాళీ చేస్తా: రాహుల్ గాంధీ
Follow us on:  YoutubeInstagramGoogle News

Latest Articles

దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ

భారత రైల్వే చరిత్రలో సరికొత్త విప్లవం వచ్చింది. తొలి హైడ్రోజన్‌ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. రైలుకు పచ్చజెండా ఊపారు. హర్యానాలోని జింద్‌ నుంచి సోనిపట్‌ మధ్య ఈ హైడ్రోజన్‌ రైలు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్