24.7 C
Hyderabad
Monday, October 2, 2023

హైదరాబాద్ లో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా మరోసారి పోస్టర్ల కలకలం

Poster War |దేశంలో ప్రస్తుతం రాజకీయ నాయకులకు సంబంధించిన పోస్టర్ల ట్రెండ్ నడుస్తోంది. ప్రత్యర్థి పార్టీల నాయకులను టార్గెట్ చేస్తూ ఇతర పార్టీల నేతలు పోస్టర్లు అంటిస్తున్నారు. తెలంగాణలో కూడా కొంతకాలంగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య పోస్టర్ల వార్(Poster War) జరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్ లోని ఉప్ప‌ల్ – నార‌ప‌ల్లి ఫ్లై ఓవ‌ర్ నిర్మాణం విష‌యంలో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. ‘మోదీ గారు ఈ ఫ్లైఓవర్ ఎన్ని సంవత్సరాలు కడతారు..? 2018, మే 5న ఉప్పల్-నారపల్లి ఫ్లైఓవర్ పనులు ప్రారంభమై.. ఇప్పటికీ ఐదేళ్లు పూర్తయినా 40 శాతం పనులు కూడా పూర్తి కాలేదంటూ’ అంటూ మెట్రో పిల్లర్లపై పోస్టర్లు ఏర్పాటుచేశారు. ఈ పోస్టర్లపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. బీఆర్ఎస్ నేతలే కావాలనే మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు అంటిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. పోస్టర్లను ఏర్పాటు చేసినవారిని వెతికే పనిలో పడ్డారు.

Read Also: అది నా బాధ్యత.. బంగ్లా ఖాళీ చేస్తా: రాహుల్ గాంధీ
Follow us on:  YoutubeInstagramGoogle News

Latest Articles

సంక్రాంతి బరిలో లైకా ప్రొడక్షన్స్ ‘లాల్ సలాం’

అగ్ర హీరోల‌తో భారీ బ‌డ్జెట్ సినిమాల‌ను నిర్మించ‌టంతో పాటు డిఫ‌రెంట్ కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాల‌కు ప్రాధాన్య‌త‌నిస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్ష‌న్స్. ఈ బ్యాన‌ర్‌పై ఎన్నో క్రేజీ ప్రాజెక్ట్స్‌ను నిర్మిస్తోంది. అలాంటి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
289FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్