హైదరాబాద్లో కురిసిన వర్షానికి బేగంపేట్ రైల్వే స్టేషన్ లోపలకు వర్షం నీరు చేరింది. వర్షం నీళ్లు లోపలికి చేరడంతో ప్రయాణికులు, స్టాఫ్ ఇబ్బందులు పడ్డారు. అమృత్ భారత్ స్టేషన్ స్కీం కింద ఈ రైల్వే స్టేషన్ను కేంద్రం అభివృద్ధి చేసింది. రూ. 38 కోట్లతో రీ డెవలప్ చేసిన బేగంపేట్ రైల్వేస్టేషన్ ను గత ఏడాది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంబించారు. అయినా చిన్నపాటి వర్షానికే ఇలా రైల్వేస్టేషన్లో నీరు చేరడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటన మరోసారి జరగకకుండా చూడాలని కోరుతున్నారు. బేగంపేట్ రైల్వేస్టేషన్లో వర్షం నీరు చేరడంపై సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు స్పందించారు. సంబంధిత అధికారులను చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
బేగంపేట్ రైల్వేస్టేషన్లోకి వర్షం నీరు
0
18
Next article
Latest Articles
అల్వాల్లో నకిలీ ఫార్మా ఎక్సిపియెంట్స్ దందా.. రూ.70.56 లక్షల విలువైన స్టాక్ సీజ్
అల్వాల్లో ఫార్మాస్యూటికల్ ఎక్సిపియెంట్లపై అక్రమ లేబుల్ ట్యాంపరింగ్ వ్యవహారాన్ని డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (DCA) అధికారులు బట్టబయలు చేశారు. జూన్ 12న ఆల్వాల్లోని డీకే ఫార్మాస్యూటికల్స్ కార్యాలయంపై దాడులు నిర్వహించారు. ఈ దాడెలంలొ...
- Advertisement -
- Advertisement -


