ఆధునిక యుద్ధ సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన క్షిపణులు, రాకెట్ల భారీ పరీక్షను నిర్వహించడం ద్వారా ఉత్తర కొరియా మరోసారి తన సైనిక శక్తిని ప్రదర్శించింది. ప్రభుత్వ వార్తా సంస్థ కేసీఎన్ఏ ప్రకారం, ఆ దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్ పర్యవేక్షణలో వ్యూహాత్మక బాలిస్టిక్ క్షిపణులు, సుదూర ఫిరంగి రాకెట్లు, ఏఐ-మార్గదర్శకత్వంలో పనిచేసే కచ్చితమైన క్రూయిజ్ క్షిపణుల సంయుక్త పరీక్ష నిర్వహించారు. ఉత్తర కొరియా తన వ్యూహాత్మక సంప్రదాయ ఆయుధాగారాన్ని క్రమంగా ఆధునీకరిస్తోంది. దక్షిణ కొరియా సరిహద్దు సమీపంలో ఈ ఆయుధాలను మోహరిస్తామని కూడా అది ప్రతిజ్ఞ చేసింది. ఉత్తర కొరియా వద్ద ఇప్పటికే సుదూర బాలిస్టిక్ క్షిపణులు అణ్వాయుధాలు ఉన్నాయి. వ్యూహాత్మక బాలిస్టిక్ క్షిపణులపై అమర్చిన ప్రత్యేక మిషన్ వార్హెడ్ల సామర్థ్యాన్ని పరీక్షించింది. సుదూర బహుళ-ప్రయోగ ఫిరంగి రాకెట్ల విశ్వసనీయతను , ఏఐ-మార్గదర్శక వ్యూహాత్మక క్రూయిజ్ క్షిపణుల కచ్చితత్వాన్నిసైతం ఈ పరీక్ష అధ్యయనం చేసిందని కేసీఎన్ఏ పేర్కొన్నది
ఉత్తర కొరియా సైనిక శక్తి ప్రదర్శన
0
62
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


