ఇటీవల కాలంలో గుండెపోటు మరణాలు ఎక్కువైతున్నాయి. గత రెండు వారాలుగా గుండెపోటుతో వ్యక్తులు మరణించడం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. తాజాగా గుండెపోటుతో మరో వ్యక్తి ఈరోజు మృతి చెందాడు. కామారెడ్డి జిల్లాలో గోనె సంతోష్ అనే యువకుడు గుండెపోటుతో చనిపోయాడు. తన ఇంట్లో ఫోన్ మాట్లాడుతుండగా గుండెపోటుతో ఒక్కసారిగా సంతోష్ కుప్పకూలాడు. వెంటనే కుటుంబీకులు అప్రమత్తమై ఆస్పత్రికి తరలించేలోపే సంతోష్ మృతి చెందారు. దీంతో సంతోష్ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.