నెల్లూరు జిల్లా వైసీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. సూళ్లూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య నామిమేషన్ ర్యాలీలో ఇద్దరు వైసీపీ నేతల మధ్య వివాదం తలెత్తింది. కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి, కళాతూరు శేఖర్రెడ్డి మధ్య వివాదం చెలరేగింది. అయితే గతంలోనూ వీరిద్దరి మధ్య గ్రావెల్ విషయంలో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. దీంతో అధికార పార్టీ నేతలు కావడంతో పోలీసులు పట్టించుకోవడం లేదని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.