ప్రధాని మోదీ కాంగ్రెస్పై సెటైర్లు వేశారు. పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన కాంగ్రెస్, తృణ మూల్ కాంగ్రెస్ పార్టీలపై విరుచుకుపడ్డారు. సందేశ్ఖాలీలో టీఎంసీ నాయకులు మహిళ లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, ఇప్పుడు ఆ పార్టీ గుండాలు వారిని బెదిరిస్తున్నారని మోడీ ఆరోపించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధిక్యం ఆల్ టైం కనిష్ట స్థాయికి చేరుతుందని ప్రధాని అన్నారు. ఈ సారి కాంగ్రెస్ పార్టీకి యువరాజు వయసు కన్నా తక్కువ సీట్లే వస్తాయని రాహుల్ గాంధీ వయసును ప్రస్తావిస్తూ అన్నారు.