28.8 C
Hyderabad
Saturday, June 21, 2025
spot_img

ఏపీలో ఉదయం నుంచే పెరుగుతున్న ఓటింగ్ శాతం

    తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. ఏపీలోని మొత్తం 175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానా లకు, తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. సికింద్రాబాద్‌ పరిధిలోని కంటో న్మెంట్‌ అసెంబ్లీ స్థానంలో ఉపఎన్నిక కొనసాగుతోంది. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరారు. తమ అభిమాన నేతలను ఎన్నుకునేందుకు ఎండను సైతం లెక్క చేయకుండా క్యూ లైన్లలో నిలుచ్చున్నారు. ఇప్పటికే పలు వురు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియో గించుకున్నారు.

ఏపీలో అత్యధికంగా వైఎస్‌ఆర్‌ జిల్లాలో 12.09శాతం, అత్యల్పంగా గుంటూరులో 6.17శాతం ఓటింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. తెలంగాణలో అత్యధికంగా ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో 13.22శాతం, అత్యల్పంగా హైదరాబాద్‌లో 5.06శాతం పోలింగ్‌ నమోదైంది. తొలి రెండు గంటల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు 9.21శాతం ఓటింగ్‌ నమోదైంది. పులివెందులలో సీఎం జగన్ దంపతులు ఓటు వేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, లోకేశ్‌, బాలకృష్ణతోపాటు ప్రముఖులందరూ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.టీడీపీ అధినేత చంద్ర బాబు ఉండవల్లిలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రానికి సతీమణి భువనేశ్వరితో కలిసి చేరుకొని ఓటు వేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌, ఆయన సతీమణి బ్రాహ్మణి అదే పోలింగ్‌ కేంద్రంలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఓటు వేసేందుకు జనం చూపిస్తున్న చొరవ మరువలేనిదన్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్