ఏలూరు జిల్లా పోతురెడ్డిపల్లి చెరువులలో చిన్నారుల ఆటలు ప్రమాదకరంగా మారాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. వేసవి సెలవులతో పాఠశాలలు మూతపడటంతో చిన్నారులు ఇంటి వద్ద ఉంటూ చెరువు పరిసరాల్లో ఆటలతో కాలక్షేపం చేస్తున్నారు. ఇంటి పెద్దలు పనుల్లో నిమగ్నమైనప్పుడు చిన్నారులు చెరువుల వద్దకు వెళుతున్నారని గ్రామస్తులు హెచ్చరించారు. గతంలోని ఘటనలను గుర్తు చేస్తూ తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చెరువుల వద్ద రక్షణ కంచెలు ఏర్పాటు చేయాలని వారు కోరారు. హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి, చిన్నారుల భద్రతకు అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు స్థానికులు.
ప్రమాదకరంగా చెరువుల వద్ద చిన్నారుల ఆటలు
0
38
Previous article
Next article
Latest Articles
2027 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్ల జోరు
2027 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్ల జోరు కొనసాగింది. నికర ప్రత్యక్ష పన్నుల వసూళ్లు రూ.6.51 లక్షల కోట్లు కాగా... ఇది గతేడాదితో పోలిస్తే 16.4 శాతం వృద్ధి రేటు నమోదైంది....
- Advertisement -
- Advertisement -


