దేశంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రోజురోజుకీ ఎండల తీవ్రత మరింత పెరుగుతోంది. ఉత్తర భారతం నుంచి తెలుగు రాష్ట్రాల వరకు భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పంజాబ్, హర్యానా, ఢిల్లీ, యూపీ, మధ్యప్రదేశ్..ఛత్తీస్గఢ్, ఏపీలో భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో జనం వడగాల్పులతో అల్లాడిపోతున్నారు. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
నైరుతి రుతుపవనాలు విస్తరించడానికి మరింత సమయం పడుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మరో వారం రోజులు ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని తెలిపింది. ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీలు అత్యధికంగ నమోదవుతున్నాయని తెలిపింది. దీంతో ప్రజలు అప్రత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు.
తెలుగు రాష్ట్రాలు నిప్పుల కుంపటిని తలపిస్తున్నాయి.తీవ్ర వడగాలులకు జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. పగలు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి… ఇక రాత్రయినా ఆ వేడి తగ్గకపోవడంతో నిద్రపట్టక కష్టాలు పడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా పిడుగురాళ్లలో 48.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఏపీలో చాలా చోట్ల 47 డిగ్రీలకు పైగా నమోదవుతోంది. ఏపీలో 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ పిడుగురాళ్లలో అత్యధికంగా 48.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది
ఇక తెలంగాణలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. వేడికి జనం అల్లాడిపోతున్నారు. బయటకు వచ్చినా.. ఇంట్లో ఉన్నా అదే పరిస్థితి ఉంది. తెలంగాణలోని పెద్దపల్లిలో అత్యధికంగా 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిర్మల్ జిల్లా దిల్వార్పూర్లో 46.5 డిగ్రీలు… కొమురం భీం జిల్లా ఆసిఫాబాద్లో 46.3 డిగ్రీలు నమోదైంది.


