ప్రధాని మోదీ హామీలు, గ్యారంటీలు అన్నీ అబద్ధాలేనను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. కేరళలో కాంగ్రెస్ సభలో మల్లికార్జున ఖర్గే ప్రసంగించారు. ప్రతికుటుంబానికీ 15 లక్ష రూపాయలు బ్యాంకుల్లో జమ చేస్తానన్నాడు. విదేశాల్లో కాంగ్రెస్ దాచిన కోట్లాది నల్లడబ్బును వెనక్కి తీసుకువస్తాన న్నాడు. ఆ డబ్బు ఏదీ అని ప్రశ్నించారు మల్లికార్జున ఖర్గే. వచ్చే ఎన్నికల్లో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని చెప్పారు. రైతుల రెట్టింపు ఆదాయం ఏదీ అని ప్రశ్నించారు. మోదీ గ్యారంటీ అంటే ఏమిటి?.. ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చబోనని మోదీ గ్యారంటీ ఇస్తున్నారని మల్లికార్జున ఖర్గే ఎద్దేవా చేశారు.