కెనడా గూఢచార సంస్థ ఐన కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ 2025 వార్షిక నివేదిక అంతర్జాతీయ రాజకీయాల్లో మరోసారి కలకలం రేపింది. ఇదే అంశాన్ని మన దేశ ప్రధాని నరేంద్రమోడీ పలు మార్లు ఆ దేశ ప్రధాని మార్క్ కార్నీ దృష్టికి తీసుకు వెళ్లారు. కెనడా జనాభాలో అత్యధిక శాతం ప్రజలు వలస వెళ్లిన పంజాబీలే
కెనడా పార్లమెంటులో సమర్పించిన ఈ నివేదిక, ఆ దేశంలో పనిచేస్తున్న ఖలిస్తానీ శక్తులు దేశ జాతీయ భద్రతకు తీవ్రమైన నిరంతర ముప్పును కలిగిస్తున్నాయని స్పష్టంగా అంగీకరించింది.
నివేదిక ప్రకారం, కెనడా కేంద్రంగా పనిచేస్తున్న ఖలిస్తానీ తీవ్రవాద గ్రూపులు హింసాత్మక తీవ్రవాద ఎజెండాను ప్రోత్సహిస్తూనే ఉన్నాయి. ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, ఈ శక్తులు కెనడియన్ సంస్థలను దుర్వినియోగం చేస్తున్నాయి. సమాజంలోని అమాయక సభ్యుల నుండి నిధులను సేకరించి, వాటిని హింసాత్మక కార్యకలాపాలకు మళ్లిస్తున్నాయి


