అట్లాంటిక్ మహాసముద్రంలోని ఒక క్రూయిజ్ షిప్లో హంటావైరస్ సోకినట్లు ఒక కేసు నమోదైంది. ముగ్గురు మరణించగా, కనీసం మరో ముగ్గురు అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ , దక్షిణాఫ్రికా ఆరోగ్య శాఖ ఆదివారం ధృవీకరించాయి. ఎంవి హోండియస్ అనే ఈ క్రూయిజ్ షిప్ ప్రస్తుతం ఆఫ్రికా దేశమైన కేప్ వెర్డే రాజధాని ప్రైయాలో నిలిచి ఉంది. ప్రయాణికులను ఇంకా దిగడానికి అనుమతించలేదు. ఈ వ్యాధి వ్యాప్తి చెందే ప్రమాదాన్ని నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అనారోగ్యానికి గురైన వారందరికీ హంటావైరస్ సోకిందా లేదా అనేది ఇంకా తెలియరాలేదు. ఈ వ్యాధి ఎలా, ఎక్కడ పుట్టిందో నిర్ధారించడానికి దర్యాప్తు కొనసాగుతోంది.
అట్లాంటిక్ మహాసముద్రంలోని ఒక క్రూయిజ్ షిప్లో ఎలుకల వైరస్
0
82
Previous article
Latest Articles
పెరిగిన బంగారం ధరలు
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 2,890 రూపాయలు పెరిగి లక్ష 49 వేల 730 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల...
- Advertisement -
- Advertisement -


