సాధారణ ట్రాఫిక్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్వాయ్ ప్రయాణించింది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి తన నివాసం వరకు సాధారణ ట్రాఫిక్ లోనే సీఎం కాన్వాయ్ ప్రయాణం చేసింది. తన కాన్వాయ్ కోసం సిటీలో వాహనాలను నిలిపివేయడంపై పోలీస్ ఉన్నతాధికారులకు నిన్న స్పష్టమైన ఆదేశాలిచ్చారు సీఎం. ప్రజలకు రోడ్లపై ఇబ్బందులు కలిగించే చర్యలను పూర్తిగా నివారించాలని సూచించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కాన్వాయ్ వెళ్లే సమయంలో ట్రాఫిక్ను పూర్తిగా నిలిపివేయకుండా సింగిల్ లైన్లో వెళ్లడానికి వాహనాలను అనుమతించారు ట్రాఫిక్ పోలీసులు.


