ఆదాయానికి మించి ఆస్తుల కేసులో నంద్యాలలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. నంద్యాల సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ గోపాల్ రావుకు సంబంధించిన నివాసం, ఇతర ఆస్తులపై ఏపీ ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. కర్నూలులోని పెద్దపాడు సమీపంలో ఉన్న మైత్రి హోమ్స్లోని అతని నివాసంతో పాటు, అతనికి సంబంధం ఉన్న మరో ఐదు ప్రదేశాలలో ఏసీబీ అధికారులు విస్తృతమైన సోదాలు నిర్వహించారు. ఆరు ప్రదేశాలలో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నట్లు ఏసీబీ కర్నూలు ఇన్చార్జ్ డీఎస్పీ సీతారామారావు తెలిపారు. ఇప్పటివరకు, అధికారులు కర్నూలులో మూడు విలాసవంతమైన భవనాలు, ఐదు ఖాళీ ప్లాట్లను గుర్తించారు. వీటి బహిరంగ మార్కెట్ విలువ 2.80 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
నంద్యాలలో ఏసీబీ అధికారుల సోదాలు.. సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో తనిఖీలు
0
14
Previous article
Next article
Latest Articles
ధనుష్.. ప్లాన్ అదిరింది..
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తమిళ్, తెలుగు చిత్రాలతో పాటు హిందీ సినిమాలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్లో మరో ప్రతిష్టాత్మకమైన సినిమా చేసేందుకు ఓకే చెప్పారని టాక్ వినిపిస్తోంది. ధనుష్...
- Advertisement -
- Advertisement -


