మలేషియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. మలేషియాలో నావికా దళానికి చెందిన రెండు హెలికాప్టర్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. మిలిటరీకి సంబంధించిన రిహార్సల్స్ జరుగు తుండగా ఈ ప్రమాదం జరిగింది. గగనతలంలో రెండు హెలికాప్టర్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో పదిమంది నావీ సిబ్బంది ప్రాణాలు కాల్పోయారు.
మలేసియాలో ఏప్రిల్ 26న రాయల్ మలేసియన్ నేవీ దినోత్సవం జరగనుంది. ఇందుకోసం పెరక్లోని లుమత్ ప్రాంతంలో రిహార్సల్స్ నిర్వహించారు. ఈ క్రమంలో ఉదయం శిక్షణ విన్యా సాల నిమిత్తం పడంగ్ సితియావాన్ నుంచి గాల్లోకి ఎగిరిన రెండు హెలికాప్టర్లు కొద్ది క్షణాలకే ప్రమాద వశాత్తూ ఢీకొని కుప్పకూలాయి. వీటిల్లో ఒకటి విన్యాసాలు జరుగుతున్న ప్రాంతానికి పక్కనే ఉన్న స్థానిక స్టేడియంలో కూలిపోగా.. మరొకటి స్విమ్మింగ్పూల్లో పడిపోయింది. ఈ ప్రమాదంలో రెండు హెలికాప్టర్లలో ఉన్న 10 మంది సిబ్బంది మరణించారు. వీరిలో ఇద్దరు లెఫ్టినెంట్ కమాండర్లు ఉన్నారు.