విజయవాడలో పోయిన వారం జగనన్న మీద దాడి జరిగిందని, రాయి విసిరిన పిల్లవాడి మీద హత్యాయత్నం కేసు పెట్టారని సునీత అన్నారు. కడపలో ఇంటించి ప్రచారం చేస్తున్న ఆమె దాడి చేసిన పిల్లవాడిపై నాన్ బెయిలబుల్ వారెంట్ కింద జైల్లో ఉంచారని ఆరోపించారు. పులివెందులలోని మురారి చింతల గ్రామంలో వృద్ధ దంపతులపై కొందరు దాడి చేశారని, ఈ ఘటనపై బెయిలబుల్ కేసు పెట్టారని గుర్తు చేశారు. దాడి చేసిన వారు గ్రామంలో దర్జాగా తిరుగుతున్నారని, ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. మురాలచింతల ఘటనను బయట పెట్టగానే అవినాష్ రెడ్డికి, వైసీపీ పార్టీకి భయం పట్టుకుందన్నారు. అన్యాయం జరుగుతుందని చెబుతున్నాం కాబట్టే వారు భయపడుతున్నార న్నారు. వివేకానంద రెడ్డికి అన్యాయం జరిగిందనే పోరాడుతున్నానని, మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండ ఉండాలనే ఇలా చేస్తు న్నానన్నారు. ప్రజలను తమ ఓటు న్యాయం కోసం ధర్మం కోసం వేయండని సునీత పిలుపుని చ్చారు.
సీఎం జగన్ పై సునీత కామెంట్స్
0
323
Previous article
Next article
Latest Articles
జెత్వానీ కేసులో కూటమి సర్కార్కు షాక్
ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో కూటమి సర్కార్కు షాక్ తగిలింది. సీఐడీ సమర్పించిన చార్జిషీట్లో దిమ్మతిరిగే వాస్తవాలు బయటకు వచ్చాయి. జెత్వానే అతి పెద్ద బ్లాక్మెయిలర్ అని సీఐడీ తేల్చింది. విజయవాడ...
- Advertisement -
- Advertisement -


