తెలంగాణ వాసులను కల్తీ ఫుడ్ ఆందోళనకు గురి చేస్తోంది. హైదరాబాద్తోపాటు పలు ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో నాణ్యత లేని ఆహారం విక్రయిస్తున్నట్టు బయటపడటంతో మున్సిపల్ అధికారు లు దృష్టి సారించారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లాలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. జిల్లా కేంద్రంలోని పలు రెస్టారెంట్లలో సోదాలు జరిపారు. ఈ తనిఖీల్లో నిల్వ ఉంచిన మంసాహార ఉత్పత్తులను గుర్తించి, 50 వేల రూపాయల సరుకును మున్సిపల్ డంపింగ్ యార్డ్లో ఖననం చేశారు. ఈ సందర్భంగా రెస్టారెంట్ యాజమానులకు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్. వర్షాకాలంలో మరింత జాగ్రతగా ఉండాల్సిన అవసరముందని, ప్రజలను నాణ్యమైన ఆహారాన్ని విక్రయించాలని సూచించారు. లేదంటే కఠిన చర్యలు తప్పవని, రెస్టారెంట్లు సీజ్ చేస్తామని హెచ్చరించారు.
పెద్దపల్లి జిల్లాలో మున్సిపల్ అధికారుల ఆకస్మిక దాడులు
0
206
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


