తెలంగాణ వాసులను కల్తీ ఫుడ్ ఆందోళనకు గురి చేస్తోంది. హైదరాబాద్తోపాటు పలు ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో నాణ్యత లేని ఆహారం విక్రయిస్తున్నట్టు బయటపడటంతో మున్సిపల్ అధికారు లు దృష్టి సారించారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లాలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. జిల్లా కేంద్రంలోని పలు రెస్టారెంట్లలో సోదాలు జరిపారు. ఈ తనిఖీల్లో నిల్వ ఉంచిన మంసాహార ఉత్పత్తులను గుర్తించి, 50 వేల రూపాయల సరుకును మున్సిపల్ డంపింగ్ యార్డ్లో ఖననం చేశారు. ఈ సందర్భంగా రెస్టారెంట్ యాజమానులకు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్. వర్షాకాలంలో మరింత జాగ్రతగా ఉండాల్సిన అవసరముందని, ప్రజలను నాణ్యమైన ఆహారాన్ని విక్రయించాలని సూచించారు. లేదంటే కఠిన చర్యలు తప్పవని, రెస్టారెంట్లు సీజ్ చేస్తామని హెచ్చరించారు.
పెద్దపల్లి జిల్లాలో మున్సిపల్ అధికారుల ఆకస్మిక దాడులు
0
192
Previous article
Next article
Latest Articles
సైదాబాద్లోని సక్సెస్ స్కూల్లో మతబోధనల వివాదం.. పాఠశాల దగ్గర ఉద్రిక్తత
హైదరాబాద్ పాతబస్తీలోని ఓ స్కూల్లో హోమ్వర్క్కు సంబంధించిన ఓ ఘటన వివాదానికి దారితీసింది. సైదాబాద్లోని సక్సెస్ స్కూల్లో విద్యార్థులకు మతపరమైన హోం వర్క్ ఇవ్వడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూల్ యాజమాన్యాన్ని...
- Advertisement -
- Advertisement -


