భారతదేశంలో రక్త సంబంధిత స్టెమ్ సెల్ దాతల కొరత తీవ్రమైన సమస్యగా మారింది. దీని కారణంగా వేలాది మంది బ్లడ్ క్యాన్సర్ రోగులు జీవితాన్ని కాపాడే ట్రాన్స్ప్లాంట్ చికిత్సను సమయానికి పొందలేక ఇబ్బందులు పడుతున్నారు. వరల్డ్ బ్లడ్ క్యాన్సర్ డే సందర్భంగా వైద్యులు, ట్రాన్స్ప్లాంట్ నిపుణులు ఈ సమస్యపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆలస్యంగా వ్యాధి గుర్తించడం, దాతలకు తక్కువ అవగాహన, అలాగే భారత్లో చాలా చిన్న డోనర్ రిజిస్ట్రీ ఉండటం వల్ల చికిత్స ఫలితాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయని వారు హెచ్చరించారు. నిపుణుల ప్రకారం, ప్రతి సంవత్సరం భారత్లో లక్షకు పైగా మంది బ్లడ్ క్యాన్సర్లతో బాధపడుతున్నారు. వారిలో ప్రతి సంవత్సరం 70,000 మందికి పైగా మరణాలు నమోదు అవుతున్నాయి. లుకేమియా, లింఫోమా, మల్టిపుల్ మైలోమా వంటి వ్యాధులతో పాటు కొన్ని తీవ్రమైన రక్త సంబంధిత రుగ్మతలలో స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ మాత్రమే పూర్తిగా నయం చేసే చికిత్సగా పరిగణించబడుతోంది.
భారత్లో తీవ్ర బ్లడ్ స్టెమ్ సెల్ డోనార్ కొరత.. పోరాడుతున్న బ్లడ్ క్యాన్సర్ రోగులు
0
54
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


