కాకినాడ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతోంది. రెండో రోజు కలెక్టరేట్ లో జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. తొలుత ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్తు కార్యకాల పాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. గత ఐదేళ్లలో ప్రభుత్వ ప్రోత్సాహకాలను అడిగి తెలుసుకు న్నారు. మహిళా, స్వయం సహాయక సంఘాలకు సంఘాల కు ఇస్తున్న ప్రోత్సాహకాలపై ఆరా తీశారు. ఈ సమావేశంలో కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ, వనమాడి కొండబాబు, పంతం నానాజీ, వరుపుల సత్యప్రభ ఇతర అధికారులు పాల్గొన్నారు. అనంతరం జలవనరుల శాఖ, అటవీశాఖ, రహదారుల పరిస్థితిపై సమీక్షించనున్నారు. సాయంత్రం ఎంపీ, ఎమ్మెల్యేలతో పవన్ సమావేశమవుతారు. రేపు ఉప్పాడ కొత్తపల్లి తీర ప్రాంతాన్ని పరిశీలించనున్నారు.