కేవలం అధికార దాహంతోనే గతంలో పాలకులు 370 వ అధికరణాన్ని తీసుకువచ్చి.. కశ్మీరీలకూ, దేశ ప్రజలకూ మధ్య ఓ గోడ నిర్మించారని ప్రధాని నరేంద్రమోదీ ఆరోపించారు. దేశ ప్రజల ఆశీస్సులతో ఎన్డీఏ సర్కార్ ఈ గోడను తొలగించి, దాని శిథిలాలను కూడా రూపుమాపినట్లు తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్ లో శాంతి నెలకొందన్నారు. దేశ ప్రజలందరూ కశ్మీర్ ప్రజలతో మమేక మవుతున్నార న్నారు. కాంగ్రెస్ పార్టీ కానీ, మరే పార్టీ కానీ మళ్లీ 370 అధికరణాన్ని పునరుద్ధరిస్తామంటే..దేశ ప్రజలు వారిని తిరస్కరించడం ఖాయం అని ప్రధాని హెచ్చరించారు.