డిజిటల్ రంగంలో భారత్ చాలా మార్పులు తీసుకొచ్చిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. విద్య, వ్యవసాయం తదితర రంగాల్లో టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. అయితే, కృత్రిమ మేధతో కొత్త సవాళ్లు ఎదురవుతు న్నట్లు తెలిపారు. ప్రధాని మోదీ, టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ చాయ్ పే చర్చలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిజిటల్ టెక్నాలజీ సహా పలు రంగాలపై వీరిద్దరూ చర్చించారు. డిజిటల్ టెక్నాలజీతో సామాన్యులకు కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం చేసిందన్నారు. ప్రభుత్వ అవసరం ఉన్న పేదలకు డిజిటల్ టెక్నాలజీ దోహదపడుతోందని చెప్పారు. సైకిల్ రాని మహిళలు కూడా పైలట్లు, డ్రోన్లు ఆప రేట్ స్థాయికి ఎదిగారని ప్రధాని మోదీ తెలిపారు.