ప్రజావాణిలో వచ్చిన సమస్యల పరిష్కారానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అరుణశ్రీతో కలిసి ఆయన అర్జీలు స్వీకరించారు. ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 42 దరఖాస్తులు రాగా, వాటిలో రెవెన్యూకు సంబంధిం చిన12, ఇతర శాఖలకు చెందినవి 30 ఉన్నాయని ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. గోదావరిఖని, మంథని మండలం సిరిపురం గ్రామాల ప్రజల నుంచి వచ్చిన అర్జీలపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.