బీజేపీపై కాంగ్రెస్ పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతులను అనేక ఇబ్బందులకు గురి చేశారని ఫైర్ అయ్యారు. రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ చట్టాలను రద్దు చేశారని మండిపడ్డారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగానికి ఉచిత కరెంట్ ఇచ్చిందన్నారు. వ్యవసాయాన్ని ప్రోత్సహించి, ఏకకాలంలో రుణమాఫీ చేసిందని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా ఏకకాలంలో రైతులకు ఆగస్టు 15లోపు 2లక్షల రుణమాఫీ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇక బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రైతులను నట్టేట ముంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులందరూ కాంగ్రెస్ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.
బీజేపీ, బీఆర్ఎస్లపై పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి ఆగ్రహం
0
212
Previous article
Next article
Latest Articles
సెక్రటేరియట్ వద్ద దంపతుల ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్లోని సెక్రటేరియట్ వద్ద దంపతుల ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. సిద్ధిపేట జిల్లా కొండపోచమ్మపల్లికి చెందిన దంపతులు కృష్ణయ్య, సాయమ్మలు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. తమ భూమి విషయంలో అధికారులు పట్టించుకోవడం...
- Advertisement -
- Advertisement -


