లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో భారీగా నగదు పట్టుబడింది. జిల్లాలోని జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్పోస్టు వద్ద పోలీసులు వాహనా లను తనిఖీచేశారు. దీంతో ఓ లారీలో తరలిస్తున్న 8.40 కోట్లు పట్టు బడ్డాయి. ఎలాంటి పత్రాలు చూపించకపోవ డంతో నగదును సీజ్ చేశారు. అక్రమంగా డబ్బును తరలి స్తున్న ఇద్దరిని అరెస్టు చేశారు. నగదును హైదరాబాద్ నుంచి గుంటూరుకు తరలిస్తున్నట్లు గుర్తించారు.