ప్రధాని మోదీపై మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి. పచ్చకామెర్ల వారికి లోకం అంతా పచ్చగానే కనిపిస్తుందని విమ ర్శించారు. అవినీతి చేసే వారికి అంతా అవినీతిమయంగానే కనిపిస్తుందని అన్నారు. బొత్స చేసిన వోక్స్ వాగన్ స్కాం గురించి ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు. విశాఖ రైల్వే జోన్ కు రాష్ట్రం ఇచ్చిన భూమి అనువుగా లేదని,వంద కోట్ల పైగా కేంద్రం రైల్వేజోన్ కు ఇస్తుంటే ఎందుకు అందిపుచ్చుకో లేకపో యారని ప్రశ్నించారు.