బీజేపీ ప్రభుత్వంపై కోదాడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి తీవ్ర విమర్శలు చేశారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్ర చేస్తుందని ఫైర్ అయ్యారు. కేంద్రంలో మోదీ ప్రభు త్వం ఏర్పడితే రిజర్వేషన్లను రద్దు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్ల పాలనలో కేసీఆర్ తెలంగా ణను ఏ విధంగానైతే లూటీ చేశారో దేశంలో బీజేపీ కూడా దేశ ప్రజల సొమ్మును దోచుకుందని మండిప డ్డారు. రఘువీర్రెడ్డికి మద్దతుగా మండల పరిధిలోని కాపుగల్లు గ్రామ ఎన్నికల ప్రచారంలో ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు.