తెలంగాణలో పవన్ రాజకీయాలపై విమర్శలు వస్తున్న వేళ జనసేనాని చేసిన పోస్టు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నిన్న ప్రెస్ మీట్ అనంతరం పవన్ వరుస ట్వీట్లు చేస్తున్నారు. ఏ రాస్తా యుద్ధాలు చేస్తుందో.. ప్రాణాల్ని ఆటబంతుల్లా విసిరేస్తుందో గెలుస్తుందో ఓడుతుందో.. కానీ ముందుకు పోతుందో.. అదే తన రాస్తా అంటూ రాసుకొచ్చారు. ఏ రాస్తాలో సంకెళ్లు కూడా సవాల్ చేస్తాయో.. అపజయం కూడా అగ్నిజ్వాలై మండుతుందో.. మరణం మహాప్రబంధంగా ప్రతిధ్వనిస్తుందో అదే తన రాస్తా… అంటూ చెప్పుకొచ్చారు. ఈ కవితను ప్రముఖ కవి శేషేంద్ర రాశారు. దీనికంటే ముందు జై తెలంగాణ, జై భారత్, జై హింద్ అంటూ పవన్ పోస్ట్ చేశారు. వరుస ట్వీట్లు చేస్తుండటంతో పవన్ చెప్పినట్టుగానే తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది.
ప్రెస్ మీట్ అనంతరం పవన్ వరుస ట్వీట్లు
0
28
Previous article
Latest Articles
భారతీయులు ఉన్న నౌకపై దాడి చేసింది అమెరికానే
24 మంది భారతీయులు ఉన్న నౌకపై దాడి చేసింది అమెరికానే అని ఆ దేశ సెంట్రల్ కమాండ్ ధృవీకరించింది. నిబంధనలకు విరుద్ధంగా ఇరాన్ పోర్టుకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో దాడి చేసినట్టు ప్రకటించింది. ఈ...
- Advertisement -
- Advertisement -


