కాంగ్రెస్ ప్రభుత్వంపై మహేశ్వరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి, మాట తప్పారని విమర్శించారు. ఇక కళ్యాణలక్ష్మి కింద తులం బంగారం ఇస్తానని ఇవ్వలేదన్నారు. గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేసిన రేవంత్రెడ్డిని, రానున్న ఎన్నికల్లో ఓడించాలని ఆమె పిలుపునిచ్చారు. చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్కు మద్దతుగా సబితా నియోజక వర్గంలోని కందుకూరు, మహేశ్వరం మండల కేంద్రాల్లో రోడ్ షో నిర్వహించారు.