తెలంగాణలో నిరుద్యోగులకు టీజీపీఎస్సీ గుడ్ న్యూస్ చెప్పింది. మే 1 నుంచి కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేస్తామని వెల్లడించింది. మార్చి 31లోగా ఉద్యోగ ఖాళీల వివరాలను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్టు టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు.
ప్రభుత్వం తెలిపిన ఖాళీల ప్రకారం నోటిఫికేషన్ల జారీపై ఏప్రిల్లో కసరత్తు చేస్తామని ఆయన తెలిపారు. కొత్త నోటిఫికేషన్లు ఇచ్చి 6 నుంచి 8 నెలల్లో భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తామని బుర్రా వెంకటేశం ప్రకటించారు. గురువారం గ్రూప్-3 కీ … రెండ్రోజుల్లో గ్రూప్-2 కీ విడుదల చేయనున్నట్టు టీజీపీఎస్సీ ఛైర్మన్ తెలిపారు.
షెడ్యూల్ ప్రకారం ఫలితాలు వచ్చేలా పనిచేస్తున్నామని టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. ఈనెల 11, 12 తేదీల్లో బెంగళూరులో పబ్లిక్ సర్వీస్ కమిషన్ల సదస్సు ఉంటుందని, ఉద్యోగ పరీక్షల విధానాలపై సదస్సులో చర్చిస్తామని బుర్రా వెంకటేశం చెప్పారు.