ప్రశాంతంగా ముగిసిన ‘నీట్’ పరీక్ష

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: జాతీయస్థాయిలో మెడిసన్ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్(నీట్) పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఆదివారం మధ్యాహ్నం 2గంటలకు మొదలైన పరీక్ష సాయంత్రం 5.20గంటల వరకు కొనసాగింది. దేశవ్యాప్తంగా ఈ పరీక్షకు 18.72లక్షల మంది హాజరయ్యారు. దేశంలోని 499 నగరాలు, పట్టణాలతో సహా విదేశాల్లోనూ పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేశారు అధికారులు. ఏపీ నుంచి 68,022.. తెలంగాణ నుంచి 70వేల మంది వరకు నీట్ పరీక్షకు హాజరయ్యారు.

పరీక్షా కేంద్రాల్లోకి వెళ్లే ముందు విద్యార్థులను నిశితంగా తనిఖీలు చేశారు. చెవి కమ్మలు, ముక్కు పుడకలు, ఉంగరాలు, ఇతర ఆభరణాలు ధరించిన వారి నుంచి ఆ వస్తువులను తీసివేయించారు. అయితే అధికారుల రూల్స్ పై తల్లిదండ్రులు తీవ్రంగా మండిపడ్డారు. ఇవేమీ రూల్స్ అంటూ అసహనం వ్యక్తం చేశారు. కాగా మణిపూర్ లో హింసాత్మక వాతావరణం నేపథ్యంలో అక్కడి విద్యార్థులకు కొన్నిరోజుల తర్వాత నీట్ పరీక్ష నిర్వహించనున్నారు.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్