మణిపూర్ నుంచి ఏపీ విద్యార్థులను తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు: బొత్స

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: అంతర్గత ఘర్షణలతో భగ్గమంటోన్న మణిపూర్ రాష్ట్రంలో చిక్కుకుపోయిన ఏపీ విద్యార్థుల తరలింపునకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మణిపూర్ లో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులతో మాట్లాడుతున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. విద్యార్థుల కోసం హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటివరకు 100మంది విద్యార్థులు తమ వివరాలు నమోదు చేసుకున్నారని.. మరో 50మంది విద్యార్థులు ఉండొచ్చని అంచనా వేస్తున్నామని పేర్కొన్నారు. విమానయానశాఖ మంత్రితో మాట్లాడి వారిని తీసుకువచ్చేందుక ప్రత్యేక విమానం ఏర్పాటుశామని వెల్లడించారు. అందుచేత విద్యార్థులు, వారి తల్లిండ్రులు ఎటువంటి ఆందోళన చెందవద్దని ఆయన సూచించారు.

విద్యార్థుల తరలింపు ప్రక్రియను ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ హిమాన్షు కౌశిక్(నెంబర్:88009 25668), ఏపీ భవన్ ఓఎస్డీ రవిశంకర్(నెంబర్: 91871 99905) పర్యవేక్షిస్తున్నారని బొత్స వెల్లడించారు. కాగా కొన్నిరోజులుగా మణిపూర్ లో గిరిజనులు, గిరిజనేతరుల మధ్య ఎస్టీ హోదా వివాదం నేపథ్యంలో తీవ్రస్థాయిలో ఘర్షణలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆ ఘర్షణల్లో 50మందికి పైగా మరణించారు.

Latest Articles

కళ్యాణ్ రామ్.. ప్లాప్ డైరెక్టర్ కి ఓకే చెప్పాడా..?

నందమూరి కళ్యాణ్ రామ్.. బింబిసార మూవీతో బ్లాక్ బస్టర్ సాధించిన తర్వాత చేసిన సినిమాలు ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఇప్పుడు వెంకీతో కలిసి హిట్ మిషన్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో.. చేస్తున్న క్రేజీ మల్టీస్టారర్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్