జవాన్ గోవింద్ అంత్యక్రియలు పూర్తి.. భారీగా తరలివచ్చిన ప్రజలు

దేశం కోసం ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధపడే జవాన్లు ఒక్కోసారి విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోతుంటారు. అలా మన తెలుగు రాష్ట్రానికి చెందిన ఓ జవాన్ ప్రాణాలు కోల్పోయాడు. విజయనగరం జిల్లా చీపురల్లి మండంలోని పర్ల గ్రామానికి చెందిన చందక్ గోవింద్ విశాఖలోని నేవల్ బేస్ లో మైరెన్ కమాండర్ గా పనిచేస్తున్నాడు. అయితే పారా గ్లైడింగ్ శిక్షణ కోసం కోల్ కత్తా వెళ్లాడు. అక్కడ శిక్షణ సమయంలో హెలికాఫ్టర్ నుంచి కిందకు దిగే సమయంలో పారాచ్యూట్ తెరుచుకోకపోవడంతో వేల అడుగుల ఎత్తులో నుంచి కిందకు పడిపోయాడు. తీవ్రగాయాలతో గోవింద్ కన్నుమూశాడు. ఈ దుర్ఘటనతో అధికారులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.

గోవింద్ మృతదేహాన్ని విశాఖలోని ఐ.ఎన్.ఎస్ కర్ణలో ఉంచిన ఆర్మీ అధికారులు నివాళులు అర్పించారు. అనంతరం స్వగ్రామానికి తరలించారు. మృతదేహం చేరుకోగానే తల్లి, బంధువుల రోదనలు మిన్నంటాయి. చిన్న వయసులోనే మమ్మల్ని వదిలి వెళ్లిపోయావా అంటూ భోరున విలపించారు. జవాన్ గోవింద్ ను కడసారి చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. 20కిలోమీటర్ల మేర గోవింద్‌ అంతిమయాత్ర జరిగింది. అమర్ రహే గోవింద్, జై జవాన్ అంటూ పెద్ద ఎత్తున జనాలు నినాదాలు చేశారు. అధికారిక లాంఛనాలతో గోవింద్ అంత్యక్రియలు ముగిశాయి.

Latest Articles

జెత్వానీ కేసులో కూటమి సర్కార్‌కు షాక్‌

ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో కూటమి సర్కార్‌కు షాక్‌ తగిలింది. సీఐడీ స‌మ‌ర్పించిన చార్జిషీట్‌లో దిమ్మ‌తిరిగే వాస్త‌వాలు బయటకు వచ్చాయి. జెత్వానే అతి పెద్ద బ్లాక్‌మెయిల‌ర్ అని సీఐడీ తేల్చింది. విజయ‌వాడ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్