29.7 C
Hyderabad
Tuesday, May 30, 2023

Rahul Gandhi |కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు.. కారణం అదే..

కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షులు, ఎంపీ రాహుల్‌ గాంధీ(Rahul Gandhi)కి ఓ పరువు నష్టం కేసులో సూరత్‌ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. మోదీ ఇంటి పేరు ఉన్నవారందరూ దొంగలు అంటూ 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కర్ణాటకలోని కోలార్‌లో రాహుల్‌ గాంధీ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై గుజరాత్‌ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్‌ మోదీ సూరత్‌ న్యాయస్థానంలో పరువునష్టం దావా వేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు రాహుల్‌ గాంధీ వాంగ్మూలాన్ని నమోదు చేసింది. తాను అలా అనలేదని న్యాయస్థానానికి రాహుల్‌ గాంధీ తన వాదనను వినిపించారు. కానీ, కోర్టు మాత్రం ఐపీసీ సెక్షన్‌ 499, 500 ప్రకారం ఆయనను దోషిగా తేల్చింది. మరోవైపు రాహుల్‌ గాంధీ అభ్యర్థన మేరకు బెయిల్‌ కూడా మంజూరు చేసింది.

అలాగే ఈ తీర్పును పై కోర్టులో అప్పీలు చేసుకునేందుకు న్యాయస్థానం అవకాశం ఇచ్చింది. ఈ మేరకు శిక్షను 30 రోజుల పాటు నిలుపుదల చేసింది. తీర్పు వెలువరించిన సమయంలో రాహుల్‌ గాంధీ కోర్టులోనే ఉన్నారు.

కోర్టు తీర్పు అనంతరం రాహుల్‌ గాంధీ స్పందించారు. మహాత్మా గాంధీ చేసిన ఓ వ్యాఖ్యను కోర్టు తీర్పు తర్వాత రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) ట్వీట్‌ చేశారు. సత్యం, అహింసపైనే నా ధర్మం ఆధారపడి ఉంది. సత్యం నా భగవంతుడు. ఆయన్ని చేరుకోవడానికి కావాల్సిన సాధనమే అహింస అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఆయన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా స్పందిస్తూ.. తన సోదరుడు ఎప్పుడూ భయపడలేదు. భవిష్యత్‌లోనూ భయపడడు అంటూ వ్యాఖ్యానించారు.

Read Also:  దేశ రాజధాని ఢిల్లీలో పోస్టర్ల వార్

Follow us on:   Youtube   Instagram

Latest Articles

1200 మంది ఆదివాసీల మతం మార్చిన 12 మంది ఫాస్టర్లు: ఎంపీ సోయం

స్వతంత్ర, వెబ్ డెస్క్: అమాయక ఆదివాసీలను మత మార్పిడులు ప్రేరేపిస్తే ఉపేక్షించేది లేదన్నారు బీజేపీ నేత, ఎంపీ సోయం బాపూరావు. ఆదివాసీల మత మార్పిడులను నిరసిస్తూ ఆదిలాబాద్ లో జనజాతి సురక్షా మంచ్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
251FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్