31.7 C
Hyderabad
Tuesday, May 13, 2025
spot_img

వైసీపీ రెండు వర్గాలుగా విడిపోయింది: నారా లోకేశ్

టీడీపీ యువనేత నారా లోకేశ్(Nara Lokesh) పాదయాత్ర శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో కొనసాగుతోంది. గుమ్మయ్యగారిపల్లిలో నిర్వహించిన బహిరంగసభలో మాట్లాడిన లోకేశ్.. వైసీపీ రెండు వర్గాలుగా విడిపోయిందని ఆరోపించారు. ఒకటి రాజారెడ్డి వర్గం.. రెండు అంబేద్కర్ వర్గం అని తెలిపారు. రాజారెడ్డి వర్గానికి జగన్(Jagan) అధ్యక్షుడైతే.. అంబేద్కర్ వర్గానికి ఉండవల్లి శ్రీదేవి(Undavalli Sridevi) అధ్యక్షురాలని తెలిపారు. జగన్ పరిపాలన చెత్త పరిపాలన అని సాక్షాత్తూ వైసిపి ఎమ్మెల్యేలే అంటున్నారని వెల్లడించారు.

సాగనిస్తే పాదయాత్ర.. అడ్డుకుంటే దండయాత్ర అని సీఎం జగన్ కు మర్యాదగా చెప్పానని.. అయినా ఆయన వినలేదన్నారు. అడుగుడుగునా యాత్రకు అడ్డంకులు సృష్టించారని.. ఇప్పుడేమో పాదయాత్ర దెబ్బకు తాడేపల్లి ప్యాలెస్ పునాదులు కదులుతున్నాయని ఎద్దేవాచేశారు. ఇక దండయాత్ర ప్రారంభమైందని.. వైసీపీ పతనం ఖాయమని వ్యాఖ్యానించారు. భూస్వాముల నుంచి భూముల్ని విడిపించి పేదలకు పంచిన పరిటాల శ్రీరాములయ్య పుట్టిన గడ్డ పెనుకొండ అని వివరించారు. ఫ్యాక్షన్ రూపంలో సమాజాన్ని పట్టి పీడిస్తున్న అరాచక శక్తులను అణిచివేసిన పరిటాల రవీంద్రను ఎమ్మెల్యేను చేసి అసెంబ్లీకి పంపిన ప్రాంతం ఇది అని లోకేశ్(Lokesh) పేర్కొన్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్