హైదరాబాద్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీషీటర్ సల్మాన్ హత్య కలకలం రేపింది. అతని బంధువులే గొంతు కోసి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. సల్మాన్ హత్యలో మహిళలు కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. నిన్న రాత్రి అతని సోదరి స్వర్ణ ఫోన్ చేసి డబ్బులు ఇస్తానని చెప్పి అయ్యప్ప స్వామి టెంపుల్ వద్దకి రమ్మని పిలిచింది. అక్కడే ఉన్న సూరి అతని స్నేహితుడు తరుణ్, నాని మరికొందరితో కలిసి సల్మాన్ గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. మీర్పేట్ పోలీసులు కేసు నమో దు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.