30.2 C
Hyderabad
Thursday, September 28, 2023

మోడీ ప్రభుత్వం బంపర్ ఆఫర్

కేంద్ర ప్రభుత్వం సరికొత్త కాంటెస్ట్ తో మరో ఆఫర్ ను ముందుకు తీసుకొచ్చింది. ఇందులో విజేతగా నిలిస్తే క్యాష్ ప్రైజ్ ని పొందవచ్చు. ఈ కాంటెస్ట్ లో రూ.1000 నుంచి రూ. 6 వేల వరకు పొందొచ్చు. ఎమర్జెన్సీ రెస్పాన్స్ సర్వీసులను మెరుగుపరచాలని మోదీ ప్రభుత్వం చూస్తోంది. మహిళల భద్రత లక్ష్యంగా కొత్త ప్రాజెక్ట్‌ను తీసుకు వచ్చింది. ఈ సర్వీస్ పేరు ‘ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్’. దీని కోసం కేంద్ర హోమ్ శాఖ 112 అనే పాన్ ఇండియా సింగిల్ నెంబర్‌ను తీసుకు వచ్చింది.

పోలీసులకు, ఫైర్, అంబులెన్స్ ఇలా పలు రకాల ఎమర్జెన్సీ సర్వీసులు ని ఈ నెంబర్ తో పొందొచ్చు. తాజాగా మైగౌవ్‌తో కలిసి ఒక కాంటెస్ట్ ని హోం శాఖ నిర్వహిస్తోంది. రీల్స్ లేదా షార్ట్ వీడియో, లోగో డిజైన్, జంగీల్ కంపోజ్ వంటి వాటికి కోసం అప్లికేషన్స్‌ను ఆహ్వానిస్తోంది. దీనిలో విజేతగా నిలిస్తే రూ. 6 వేల వరకు డబ్బులు సొంతం చేసుకోవచ్చు. లోగో డిజైన్, జంగిల్ కంపోజ్, రీల్ ఇలా కేటగిరి ప్రకారం క్యాష్ ప్రైజ్ మారిపోతుంది. రీల్ చేసి విజేతగా నిలిస్తే రూ. 3 వేలు ఇస్తారు. ఫస్ట్ విన్నర్‌కు ఈ డబ్బులొస్తాయి. రెండో విన్నర్‌కు రూ. 2 వేలు, మూడో విన్నర్‌కు రూ. 1000 వస్తాయి. లోగో డిజైన్ చేయాలని భావిస్తే విజేతలకు రూ. 3 వేలు లభిస్తాయి. టాప్ 5 స్థానాల్లో వాళ్లకి నిలుస్తాయి. పోస్టర్‌ ని పీడీఎఫ్ లేదా జేపీఈజీలో డిజైన్ పంపించాలి. ఫైల్ సైజ్ 2 ఎంబీ కన్నా ఎక్కువ ఉండకూడదు. అప్లికేషన్ కి లాస్ట్ డేట్ ఏప్రిల్ 8గా ఉంది.

Latest Articles

భారత హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ కన్నుమూత

స్వతంత్ర వెబ్ డెస్క్: భారత హరిత విప్లవ పితామహుడు, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ కన్నుమూశారు. ఆయన వయసు 98 ఏళ్లు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న స్వామినాథన్ చెన్నైలోని ఓ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
288FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్