మోడీ ప్రభుత్వం బంపర్ ఆఫర్

కేంద్ర ప్రభుత్వం సరికొత్త కాంటెస్ట్ తో మరో ఆఫర్ ను ముందుకు తీసుకొచ్చింది. ఇందులో విజేతగా నిలిస్తే క్యాష్ ప్రైజ్ ని పొందవచ్చు. ఈ కాంటెస్ట్ లో రూ.1000 నుంచి రూ. 6 వేల వరకు పొందొచ్చు. ఎమర్జెన్సీ రెస్పాన్స్ సర్వీసులను మెరుగుపరచాలని మోదీ ప్రభుత్వం చూస్తోంది. మహిళల భద్రత లక్ష్యంగా కొత్త ప్రాజెక్ట్‌ను తీసుకు వచ్చింది. ఈ సర్వీస్ పేరు ‘ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్’. దీని కోసం కేంద్ర హోమ్ శాఖ 112 అనే పాన్ ఇండియా సింగిల్ నెంబర్‌ను తీసుకు వచ్చింది.

పోలీసులకు, ఫైర్, అంబులెన్స్ ఇలా పలు రకాల ఎమర్జెన్సీ సర్వీసులు ని ఈ నెంబర్ తో పొందొచ్చు. తాజాగా మైగౌవ్‌తో కలిసి ఒక కాంటెస్ట్ ని హోం శాఖ నిర్వహిస్తోంది. రీల్స్ లేదా షార్ట్ వీడియో, లోగో డిజైన్, జంగీల్ కంపోజ్ వంటి వాటికి కోసం అప్లికేషన్స్‌ను ఆహ్వానిస్తోంది. దీనిలో విజేతగా నిలిస్తే రూ. 6 వేల వరకు డబ్బులు సొంతం చేసుకోవచ్చు. లోగో డిజైన్, జంగిల్ కంపోజ్, రీల్ ఇలా కేటగిరి ప్రకారం క్యాష్ ప్రైజ్ మారిపోతుంది. రీల్ చేసి విజేతగా నిలిస్తే రూ. 3 వేలు ఇస్తారు. ఫస్ట్ విన్నర్‌కు ఈ డబ్బులొస్తాయి. రెండో విన్నర్‌కు రూ. 2 వేలు, మూడో విన్నర్‌కు రూ. 1000 వస్తాయి. లోగో డిజైన్ చేయాలని భావిస్తే విజేతలకు రూ. 3 వేలు లభిస్తాయి. టాప్ 5 స్థానాల్లో వాళ్లకి నిలుస్తాయి. పోస్టర్‌ ని పీడీఎఫ్ లేదా జేపీఈజీలో డిజైన్ పంపించాలి. ఫైల్ సైజ్ 2 ఎంబీ కన్నా ఎక్కువ ఉండకూడదు. అప్లికేషన్ కి లాస్ట్ డేట్ ఏప్రిల్ 8గా ఉంది.

Latest Articles

క్రిష్ ప్రయోగం ఫలించేనా..?

మంచి కథలు చెప్పాలని తపించే దర్శకుల్లో ఒకరు క్రిష్. ఈమధ్య వరుసగా ప్లాపులు రావడంతో కెరీర్లో బాగా వెనకబడ్డాడు. అనుష్కతో ఘాటీ సినిమా చేసిన తర్వాత ఇంత వరుకు క్రిష్ మూవీ ఎవరితో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్