నేడు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల పోలింగ్ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు జరుగుతుంది. ఈ సమయంలో రాష్ట్రంలోని ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. ఓటర్లు తమ ఓటరు గుర్తింపు కార్డులను తీసుకుని వచ్చి ఓటుహక్కు వినియోగించుకోవాలన్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని పోలింగ్ కేంద్రాలను పరిశీలించి, అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేసింది. పోలింగ్ కేంద్రాల్లో సెక్యూరిటీ బృందాలు, ఎన్నికల అధికారులు, వాలంటీర్లను నియమించింది. ఓటర్లు సురక్షితంగా ఓటు వేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంది.

తెలంగాణలో ఉమ్మడి కరీంనగర్‌, మెదక్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ రెండు ఎమ్మెల్సీ స్థానాలు, అలాగే నల్లగొండ, వరంగల్‌, ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల కోసం పోలింగ్‌ జరగనుంది. కరీంనగర్‌లో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు మొత్తం 56 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా, ఇందులో 15 మంది ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి, 19 మంది నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేస్తున్నారు.

ఇక ఏపీ విషయానికి వస్తే గుంటూరు-కృష్ణా, ఉభయ గోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు, విశాఖ-విజయనగరం, శ్రీకాకుళం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. ఈ రెండు పట్టభద్రుల నియోజకవర్గాల్లో 60 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 939 పోలింగ్‌ కేంద్రాల్లో ఈ ఎన్నికలు జరుగనున్నాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 6,62,100 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి పోలింగ్‌ స్టేషన్‌లో వెబ్‌ కాస్టింగ్‌ అమలు చేస్తున్నామని ఎన్నికల ప్రధాన అధికారి తెలిపారు.

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు మార్చి 2న విడుదల కానున్నాయి. ఈ ఫలితాలు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారనున్నాయి. ఎందుకంటే ఇటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నికలు ఇవే కావడం విశేషం. ఈ ఎన్నికల్లో ఓటర్లు కాంగ్రెస్ పార్టీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

Latest Articles

నేను బీఆర్ఎస్ కు దూరమవుతున్నానని… మల్లారెడ్డి వ్యాఖ్యలపై చర్చ

మేడ్చల్‌లో మాజీ మంత్రి మల్లారెడ్డి వీడియో వైరల్ అయింది. ఒక కార్యకర్త పుట్టిన రోజు వేడుకల్లో మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను బీఆర్ఎస్‌కు దూరమవుతున్నానని.. తనను మర్చిపోతున్నారని అన్నారు. స్వయంగా మల్లారెడ్డి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్