31.7 C
Hyderabad
Sunday, June 1, 2025
spot_img

పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై సమీక్షలో మంత్రి తుమ్మల

మార్కెట్‌లోకి పత్తి వచ్చే సీజన్‌కు ముందుగానే జిన్నింగ్‌ మిల్లులను సిద్ధం చేసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులతో అన్నారు. కొనుగోలు కేంద్రాలు వారంలో ఆరు రోజుల పాటు పనిచేసేలా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా కనిష్ఠ మద్ధతు ధర, పత్తి సేకరణ మార్గదర్శకాల గురించి రైతులకు ప్రసార మాధ్యమాల ద్వారా అవగాహన కల్పించాలని సూచించారు. సచివాలయంలో పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, కాటన్‌ అసోసియేషన్‌, వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖల అధికారులతో మంత్రి సమీక్షించారు.

రాష్ట్ర కాటన్‌ వెల్ఫేర్‌ కమిటీతో పాటు జిల్లా కమిటీల్లోకి కాటన్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు, రైతు ప్రతినిధులను కూడా చేర్చుకోవాలని సీసీఐ ప్రతినిధులకు తుమ్మల సూచించారు. ఈ ఏడాది సాంకేతికంగా తీసుకువస్తున్న పేమెంట్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌, మొబైల్‌ యాప్‌లతో మిల్లర్లకు కొనుగోళ్లలో మరింత పారదర్శకతకు దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా సీసీఐ, కాటన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా సభ్యులు పలు సమస్యలు లేవనెత్తారు. వీటిని పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్